← Back to headlines

ఈ నెల 20 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

2026-05-08 01:50 • original

నవతెలంగాణ – హైదరాబాద్ : సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు రూ.5 లక్షలు ఇస్తున్నామని, ఇప్పటికే 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లబ్ధిదారులకు బిల్లులు సక్రమంగా, అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. గతంలో ఇల్లు మంజురైనా పూర్తి చేసుకోలేని వారికి వెసులుబాటు కల్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు ఏ స్థాయిలో ఉన్నా.. ఈ నెల 20లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని చెప్పారు.

The post ఈ నెల 20 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక appeared first on Navatelangana.